కాసుల వర్షం కురిపిస్తున్న ‘మేజర్’ సినిమా..!!

Updated on 17-Jun-2022
HIGHLIGHTS

అడవి శేష్ హీరోగా నటించిన 'మేజర్' కాసుల వర్షం కురిపిస్తోంది

చిత్రం తక్కువ థియేటర్లలో విడుదలైన కూడా నిలకడగా కొనసాగింది

బాక్సాఫీస్ వద్ద 60 కోట్లకు పైగా కలక్షన్స్ సాధించింది

సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా ‘అడవి’ శేష్  హీరోగా నటించిన 'మేజర్' కాసుల వర్షం కురిపిస్తోంది. జూన్ 3 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తక్కువ థియేటర్లలో విడుదలైన కూడా నిలకడగా కొనసాగింది. కమల్ హాసన్, విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాసిల్ పెద్ద పెద్ద స్టార్స్ నటించిన 'విక్రమ్' మరియు అక్షయ్ కుమార్ నటించిన 'పృథ్వీరాజ్' రెండు సినిమాలకు దీటుగా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమా ఇప్పటి వరకూ బాక్సాఫీస్ వద్ద 60 కోట్లకు పైగా కలక్షన్స్ సాధించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.  

 26/11 ముంబై దాడిలో వీర మరణం పొందిన 'సందీప్ ఉన్ని కృష్ణన్' జీవిత వృత్తాంతాన్ని (బయోపిక్) గా మేజర్ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ తోనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని అందరి నోటా అనిపించింది. థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఆకట్టుకుందని, విమర్శకుల నుండి కూడా ప్రశంసలు అందుకుంది. 2008 లో జరిగిన 26/11 ముంబై దాడి కధానాలను కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేసిన చిత్ర యూనిట్ కి హ్యాట్సాఫ్.

ఈ సినిమా 13 వ రోజు కూడా మంచి మంచి కలక్షన్ సాధించినట్లు సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా హిందీ ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకుంది. వాస్తవానికి, ఈ సినిమా అందరూ చూసేందుకు అందుబాటులో ఉండేలా చూసేందుకు టికెట్ రేట్లను చాలా తక్కువగా ఉంచడం కూడా గొప్ప విషయం. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :