చవక ధరకే ల్యాప్ టాప్ తీసుకొచ్చే పనిలో Jio

Updated on 11-Mar-2021
HIGHLIGHTS

'జియో బుక్' పేరుతో జియో ల్యాప్ టాప్స్

గూగుల్ OS తో పనిచేసే విధంగా వీటిని తయారు చెయ్యవచ్చు

చవక ధరకే ల్యాప్ టాప్ తీసుకొచ్చే పనిలో Jio

ఇప్పటికే ఎన్నో చవక ప్రోడక్ట్స్ ని పరిచయం చేసిన జియో ఇప్పుడు కొత్తగా చవక ల్యాప్ టాప్స్ ని డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అతితక్కువ ధరకే 4G ఫీచర్ ఫోన్స్ తీసుకొచ్చిన జియో ఇప్పుడు చవక ధరకే ల్యాప్ టాప్ తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు అర్ధమవుతోంది. దీన్ని బట్టి చూస్తుంటే, జియో మరొక కొత్త ప్రోడక్ట్ ని మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు పక్కాగా తెలుస్తోంది.

ఇటీవల, XDA డెవలపర్స్ జియో యొక్క ల్యాప్ టాప్ రాక గురించి కీలకమైన సమాచారాన్ని వెల్లడించింది. దీని ప్రకారం, చాలా తక్కువ ధరకే అందరికి అందుబాటులో ఉండేలా  'జియో బుక్'  పేరుతో జియో ల్యాప్ టాప్స్ తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు సూచింది. వీటి ధరను దృష్టిలో పెట్టుకొని, విండోస్ OS తో కాకుండా గూగుల్ OS తో పనిచేసే విధంగా వీటిని తయారు చెయ్యవచ్చని చెబుతోంది. అంతేకాదు, ఈ ల్యాప్ టాప్స్ ఆండ్రాయిడ్ యొక్క కస్టమ్ వెర్షన్ తో పనిచేస్తాయని, దీని JioOS గా పరిచయం చేస్తుంది.

ముఖ్యంగా, జియో ఇప్పటికే ఈ ల్యాప్ టాప్స్ తయారు చేసే పనిలో పడినట్లు ఒక నమూనా లీప టాప్ తయారు చేసినట్లు కూడా ఈ నివేదిక చెబుతోంది. ఈ ప్రోటోటైప్ ల్యాప్ టాప్ ఆండ్రాయిడ్ 665 ప్రాసెసర్ తో ఉన్నట్లు సూచింది. ఈ చిప్ సెట్ ఇన్ బిల్ట్ 4G మోడెమ్ తో     వస్తుంది కాబట్టి ఈ జియో బుక్ ల్యాప్ టాప్ నేరుగా జియో 4G నెట్వర్క్ కు కనెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇదే గనుక నిజమైతే, ఈ జియో ల్యాప్ టాప్స్ మార్కెట్లో ఒక కొత్త వరవడని తీసుకువస్తాయి.  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :