Jio కి పోటీగా Airtel భారతదేశంలో మొదటిగా 5G ని పరీక్షించింది

Updated on 29-Jan-2021
HIGHLIGHTS

Airtel ఇండియాలో మొదటిగా 5G పరీక్షించిన టెలికం సంస్థగా అవతరించింది

Airtel 4G మరియు 5G నెట్వర్క్ లను ఏకకాలంలో నిర్వహించింది.

ఎయిర్టెల్ నెట్వర్క్ యొక్క 5 జి సంసిద్ధతను ధృవీకరించింది.

IMC 2020 నుండి భారతదేశంలో ముందుగా 5G సర్వీస్ అందించనున్నట్లు జియో ప్రకటించింది. అయితే, Airtel అందరికంటే ముందుగా 5G డెమోన్ స్ట్రేట్ ను విసజయవంతంగా నిర్వహించింది. ఇండియాలో మొదటిగా 5G పరీక్షించిన టెలికం సంస్థగా అవతరించింది. అంతేకాదు, 4G మరియు 5G నెట్వర్క్ లను ఏకకాలంలో నిర్వహించింది.

Airtel తన ప్రస్తుత సరళీకృత స్పెక్ట్రంను మిడ్ బ్యాండ్ 1800 MHz లో NSA (నాన్ స్టాండ్ అలోన్) నెట్వర్క్ టెక్నాలజీ ద్వారా చేసింది. డైనమిక్ స్పెక్ట్రం షేరింగ్ ఉపయోగించి, ఎయిర్టెల్ తన 5G మరియు 4G లను ఒకే స్పెక్ట్రం బ్లాక్ లో ఏకకాలంలో నిర్వహించింది. ఈ పనితీరు రేడియో, కోర్ మరియు ట్రాన్స్ పోర్ట్ వంటి అన్ని డొమైన్లలో ఎయిర్టెల్ నెట్వర్క్ యొక్క 5 జి సంసిద్ధతను ధృవీకరించింది.

ఇక ప్రస్తుత టెక్నాలజీతో పోలిస్తే, ఎయిర్టెల్ 5 జి 10 రేట్లు వేగవంతమైనదిగా వుంటుంది. ముఖ్యంగా, హైదరాబాద్ నగరంలో డెమోన్ స్ట్రేట్ చేసిన ఎయిర్టెల్ 5G తో యూజర్లు తమ 5 జీ ఫోన్లో పూర్తి నిడివి గల సినిమాని సెకన్లలో డౌన్లోడ్ చేసుకోగలిగారు. ఈ పనితీరు తమ సంస్థ యొక్క సాంకేతిక సామర్థ్యాలను నొక్కి చెప్పిందని ఎయిర్టెల్ పేర్కొంది. అలాగే, 5 జి అనుభవం యొక్క పూర్తి ప్రభావం, తగినంత స్పెక్ట్రం అందుబాటులో ఉన్నప్పుడు మరియు ప్రభుత్వ అనుమతి పొందినప్పుడు తన వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కూడా తెలిపింది.

ఇక జియో విషయానికి  వస్తే, 2021 రెండవ అర్ధభాగంలో తన 5G సర్వీసులను లాంచ్ చేయడానికి సిద్దవుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.                    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :